fbpx
Sunday, May 4, 2025
HomeAndhra Pradeshఐపీఎస్ ఆఫీసర్ ఆంజనేయులు అరెస్ట్‌: జత్వాని కేసులో కీలక మలుపు

ఐపీఎస్ ఆఫీసర్ ఆంజనేయులు అరెస్ట్‌: జత్వాని కేసులో కీలక మలుపు

ARREST-OF-IPS-OFFICER-ANJANEYULA:-KEY-TURNING-POINT-IN-JATWANI-CASE

అమరావతి: ఐపీఎస్ ఆఫీసర్ ఆంజనేయులు అరెస్ట్‌: జత్వాని కేసులో కీలక మలుపు

ముంబై నటి ఫిర్యాదుతో కేసు నమోదు

ముంబైకి చెందిన నటి కాదంబరి జత్వాని (Kadambari Jathwani) కేసు విచారణ వేగవంతమవుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కేసును సీరియస్‌గా తీసుకొని ఏపీ సీఐడీ (AP CID) అధికారుల చేత విచారణను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు తాజాగా ఒక కీలక పరిణామానికి తెర తీశారు.

హైదరాబాద్‌లో ఐపీఎస్ ఆంజనేయులు అరెస్ట్

మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఐపీఎస్ అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులు (PSR Anjaneyulu)ని ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన సస్పెన్షన్‌లో ఉన్నారు. కాదంబరి జత్వాని ఫిర్యాదులో ఆంజనేయులపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. అలాగే, గతంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju)పై థర్డ్ డిగ్రీ వేదింపుల కేసులో కూడా ఆయన ఏ2 గా వున్నారు.

అరెస్ట్ అనంతరం విచారణకు విజయవాడ తరలింపు

ఆంజనేయులు ఇప్పటి వరకు ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానంలో ఎటువంటి పిటిషన్ దాఖలు చేయలేదు. అరెస్ట్ అనంతరం ఆయనను విజయవాడకు తీసుకెళ్లి అక్కడ విచారణ కొనసాగించనున్నారు. సీఐడీ అధికారులు దీనిపై పూర్తి వివరాలను తెలియచేయనున్నారు.

జత్వానీకి మద్దతుగా కేసు నమోదు చేసిన ప్రభుత్వం

జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) ప్రభుత్వ కాలంలో వైసీపీ నేత విద్యాసాగర్ (Vidyasagar) నటి జత్వానీపై తీవ్రంగా వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. ఒక తప్పుడు ఫిర్యాదు అనంతరం ముంబై వెళ్లిన పోలీసులు ఆమెను కుటుంబ సభ్యులతో పాటు అరెస్ట్ చేసిన ఘటన అప్పట్లో పెద్ద దుమారమే రేపింది.

కేసు వెనక్కు తీసుకోవాలంటూ ఒత్తిడి

ఒక ప్రముఖ వ్యాపారవేత్తపై రేప్ కేసు పెట్టిన నేపథ్యంలో ఆమెను టార్గెట్ చేశారని తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ కేసును వాపస్ తీసుకోవాలంటూ జత్వానీపై తీవ్ర ఒత్తిడి పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు – పీఎస్‌ఆర్ ఆంజనేయులు, సీపీ కాంతి రాణా టాటా (Kanti Rana Tata), విశాల్ గున్ని (Vishal Gunni) – పాత్ర వహించారని ప్రాథమిక ఆధారాలతో వారిని ఇదివరకే సస్పెండ్ చేయడం జరిగింది.

ప్రభుత్వ మార్పుతో కదిలిన చట్టం

సామాజిక సంక్షోభం రేకెత్తించిన ఈ కేసు వైసీపీ పరాజయంతో వెలుగులోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. ముగ్గురు అధికారులపై ప్రభుత్వం సస్పెన్షన్‌ను 2025 సెప్టెంబర్ 25 వరకు పొడిగిస్తూ ఈమధ్యే ఉత్తర్వులు జారీ చేసింది.

అధికారులపై ప్రభుత్వం చర్యలు

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ (K. Vijayanand) జారీ చేసిన తాజా ఉత్తర్వులతో ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ పొడిగించబడింది. విచారణ పూర్తయ్యే వరకు వీరిపై కొనసాగుతున్న నిఘా మరింత కఠినంగా ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular