fbpx
Friday, October 18, 2024
HomeNationalపెట్రోలుపై రూ. 5 తగ్గించిన అసోం బీజేపీ సర్కార్‌

పెట్రోలుపై రూ. 5 తగ్గించిన అసోం బీజేపీ సర్కార్‌

ASSAM-REDUCES-PETROL-RATES-BY-5RUPEES

గువహటి : గత కొన్ని రోజులుగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్న వేళలో అసోం రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బీజీపే సర్కారు వాహన దారులకు పెట్రోలుపై లీటరుకు 5 రూపాయలు తగ్గిస్తూ అ‍క్కడి ప్రజలకు భారీ ఊరట నిచ్చింది. అలాగే మద్యంపై సుంకాన్ని కూడా 25 శాతం వరకు తగ్గిస్తున్నట్లు అస్సాం ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది.

తగ్గించిన ఈ ధరలు ఈ రోజు అర్ధరాత్రి నుండి అమలులోకి వస్తాయని ఆర్థిక మంత్రి హిమంత బిస్వాస్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు. కోవిడ్-19 విస్తరణ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్‌, మద్యంపై అదనపు సెస్ విధించాం, కానీ ఇప్పుడు, రోగుల సంఖ్య బాగా తగ్గింది. ఈనేపథ్యంలో తాజా రేటు కోతను కూడా ప్రకటిస్తున్నామన్నారు.

పెట్రోలుపై లీటరుకు 5 రూపాయల భారం తగ్గుతుందని, తద్వారా లక్షలాది వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు, ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఇంధన ధరలు కొత్త గరిష్టాలను తాకిన సమయంలో ఈ తగ్గింపు నిర్ణయం తీసుకోవడవం గమనార్హం.

కాగా అసోంలో అసెంబ్లీ ఎన్నికలు మార్చి-ఏప్రిల్‌లో జరగనున్నాయి, ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారాన్ని నిలబెట్టుకోవాలని భారీ కసరత్తు చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular