fbpx
Tuesday, February 11, 2025
HomeTelanganaతెలంగాణలో బీర్ల ధరల పెంపు.. ఎంతంటే?

తెలంగాణలో బీర్ల ధరల పెంపు.. ఎంతంటే?

beer-price-hike-telangana-new-rates

తెలంగాణ: బీర్ల ధరలు 15 శాతం పెరుగనున్నాయి. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ నిర్ణయం తీసుకుని, నేటి నుండి అమలులోకి తెచ్చింది. పెరిగిన ధరల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు ₹700 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది.

ధరల పెరుగుదలతో వివిధ బ్రాండ్ల బీర్లు మరింత ఖరీదయ్యాయి. లైట్ బీరు ₹150 నుంచి ₹172కు, కింగ్ ఫిషర్ ప్రీమియం ₹160 నుంచి ₹184కు చేరుకుంది. బడ్వైజర్ లైట్ ₹210 నుంచి ₹241.5కి, టుబోర్గ్ స్ట్రాంగ్ ₹240 నుంచి ₹276కి పెరిగింది.

ప్రభుత్వానికి ఆదాయం పెరిగినప్పటికీ, వినియోగదారులకు ఇది భారంగా మారనుంది. బీర్ల ధరలు పెరగడం వల్ల మద్యం వినియోగం తగ్గే అవకాశముందని, దీని ప్రభావం వైన్స్ మరియు బార్లపై పడుతుందని అంటున్నారు.

కొన్ని వర్గాలు ఈ పెరుగుదలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. సామాన్య వినియోగదారులకు ఇది ఎక్కువ భారం కావచ్చని చెబుతున్నారు.

మద్యం ధరల పెంపుపై ప్రభుత్వ సపష్టికరణ ఏమిటో, ప్రజలపై దీని ప్రభావం ఎంతవరకు ఉంటుందో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular