బెంగళూరు: భారతదేశ మాజీ ప్రధాని అయిన హెచ్.డి.దేవెగౌడకు బెంగళూరు కోర్టు పెద్ద మొత్తంలొ జరిమానా విధించింది. తన పై ఉన్న పరువు నష్టం కేసులో రూ.2 కోట్లు చెల్లించాలని కోర్టు ఇవాళ దేవెగౌడను ఆదేశించింది. 2011 జూన్లో ఒక కన్నడ న్యూస్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ఎంటర్ప్రైజ్పై దేవెగౌడ వివాదాస్పద వ్యాఖ్యలను చేశారు.
పరువుకు భంగం వాటిల్లేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆ సంస్థ ప్రతినిధుల ద్వారా కోర్టులో దేవెగౌడా పై పరువు నష్టం పిటిషన్ ను దాఖలు చేసింది. ఈ పిటీషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం, సదరు కంపెనీ నంది ఇన్ఫ్రాస్ట్రక్చర్కు రూ. 2కోట్ల జరిమానా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.
అయితే, నంది కంపెనీ నష్టపరిహారంగా దేవెగౌడ నుంచి రూ.10 కోట్లు ఎన్ఐసీఈ డిమాండ్ చేసింది. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ఎంటర్ప్రైజ్పై ఇంటర్వ్యూలో చేసిన తన వాదనను ధృవీకరించడంలో దేవగౌడ విఫలమయ్యారని కోర్టు తేల్చింది. ప్రాజెక్టు కోసం అవసరమైన దానికంటే ఎక్కువ భూమిని వినియోగించిందని దేవెగౌడ చేసిన ఆరోపణలు సరికాదని కంపెనీ తరపు న్యాయవాది వాదించారు.