బెట్టింగ్ యాప్స్: పలువురు సినీ ప్రముఖులపై కేసు నమోదు
హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ (Betting Apps) ప్రచారంలో పాల్గొన్న సినీ ప్రముఖులపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో తాజాగా మియాపూర్ పోలీసులు మరో కీలక ముందడుగు వేశారు. యాప్ల ప్రచారంలో భాగస్వామ్యులైన 25 మంది సెలెబ్రిటీలపై కేసు నమోదు చేశారు.
ప్రముఖులపై కేసు నమోదు
బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన వారిలో సినీ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నటులు రానా దగ్గుబాటి (Rana Daggubati), విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), ప్రకాశ్ రాజ్ (Prakash Raj), మంచు లక్ష్మి (Manchu Lakshmi), ప్రణీత (Pranitha), నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) సహా పలువురు ప్రముఖులపై విచారణకు సిద్ధమయ్యారు.
సోషల్ మీడియా సెలెబ్రిటీలపై దృష్టి
బెట్టింగ్ యాప్ల ప్రచారంలో భాగంగా కొన్ని ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పేర్లు కూడా నమోదయ్యాయి. వీరిలో అనన్య నాగళ్ల (Ananya Nagalla), సిరి హనుమంతు (Siri Hanumanthu), శ్రీముఖి (Sreemukhi), వర్షిణి సౌందరరాజన్ (Varshini Soundararajan), వసంతి కృష్ణన్ (Vasanthi Krishnan), శోభా శెట్టి (Shobha Shetty), అమృత చౌదరి (Amrutha Chowdhary), నయని పావని (Nayani Pavani), నేహా పఠాన్ (Neha Pathan), పండు (Pandu), పద్మావతి (Padmavathi), ఇమ్రాన్ఖాన్ (Imran Khan), విష్ణు ప్రియ (Vishnu Priya), హర్ష సాయి (Harsha Sai), బయ్యా సన్నీ యాదవ్ (Bayya Sunny Yadav), యాంకర్ శ్యామల (Anchor Syamala), టేస్టీ తేజ (Tasty Teja), రీతూ చౌదరి (Ritu Choudhary), బండారు సుప్రీత (Bandaru Supreeth) ఉన్నారు.
అసలు కేసు పెట్టిందెవరు?
మియాపూర్కు చెందిన ప్రమోద్ శర్మ (Pramod Sharma) అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. ప్రాథమిక దర్యాప్తులో ఈ ప్రముఖులు బెట్టింగ్ యాప్ల ప్రచారంలో పాల్గొన్నట్లు ఆధారాలు లభించినట్లు సమాచారం.