fbpx
Saturday, September 21, 2024
HomeNationalబీహార్ లో మూడవ దశ పోలింగ్ నేడే

బీహార్ లో మూడవ దశ పోలింగ్ నేడే

BIHAR-THIRD-PHASE-ELECTIONS-TODAY

పట్నా: నేడు జరుగుతున్న మూడవ దశ ఎన్నికలతో బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల అధ్యాయం చివరదశకు చేరుకున్నట్టే. 19 జిల్లాల్లోని 78 అసెంబ్లీ స్థానాలకు ఈ రోజు పోలింగ్‌ జరుగుతుంది.

78 నియోజకవర్గాల్లో 1,204 మంది అభ్యర్థులు బరిలో దిగారు. 2.34 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక నేడు బరిలో దిగిన వారిలో అసెంబ్లీ స్పీకర్‌తో పాటు ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ మంత్రి వర్గంలోని 12 మంది మంత్రులు ఉన్నారు. ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు రెండు విడతల్లో 165 స్థానాలకు పోలింగ్‌ పూర్తయ్యింది. ఈనెల 10న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.

సిట్టింగ్‌ జేడీ(యూ) ఎంపీ బైద్యనాథ్‌ మహతా మృతితో ఈ స్థానానికి ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గాను ఇప్పటివరకు రెండు దశల్లో 165 చోట్ల పోలింగ్‌ పూర్తయింది.

ఈ ఎన్నికలలో 1,23,799 మంది పురుషులు, 12,06,378 మంది మహిళల ఓటర్లు నువ్వా నేనా అన్న రీతిలో ఎన్డీఏ- మహాకూటమి మధ్య కొనసాగుతున్న బీహార్ ఎన్నికల సమరం తనకు ఇవే చివరి ఎన్నికలు అంటూ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించిన సీఎం నితీష్ కుమార్ ఎన్నికల బరిలో జేడీయూ తరఫున అసెంబ్లీ స్పీకర్‌ విజయ్‌ కుమార్‌ చౌధరీ, పన్నెండు మంది మూడో దశలో మజ్లిస్ ప్రభావం కోసి – సీమాంచల్‌ ప్రాంతంలో భారీ సంఖ్యలో ముస్లిం ఓటర్లు పలువురు అభ్యర్థులను నిలిపిన మజ్లిస్ పార్టీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular