fbpx
Friday, October 18, 2024
HomeAndhra Pradeshఆలయాల్లో అర్చకులకు పూర్తి అధికారం: చంద్రబాబు కీలక నిర్ణయం

ఆలయాల్లో అర్చకులకు పూర్తి అధికారం: చంద్రబాబు కీలక నిర్ణయం

Chandrababu-Grants-Full-Authority-to-Priests-in-Temples

తిరుపతి లడ్డూ కల్తీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో, ఈ ఘటనపై సమగ్ర విచారణ కోరుతూ సుప్రీం కోర్టు సీబీఐ సిట్ వేసింది. ఈ నేపథ్యంలో, అలాంటి ఘటనలు మళ్లీ ఎక్కడా పునరావృతం కాకుండా ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. 

రాష్ట్రంలోని ఆలయాల్లో అర్చకులకు పూర్తి స్వయంప్రతిపత్తి కల్పిస్తూ కొత్త ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై ఏ దేవాదాయ కమిషనర్ లేదా జిల్లా అధికారులు ఆలయ వైదిక విధుల్లో జోక్యం చేసుకునే అవకాశమే ఉండదని ప్రభుత్వ ఉత్తర్వులు స్పష్టం చేశాయి. 

ఆలయాల్లో జరిగే యాగాలు, కుంభాభిషేకాలు, పూజలు వంటి అన్ని వైదిక కార్యక్రమాల్లో అర్చకులదే పూర్తి అధికారం. అధికారులు ఈ కార్యక్రమాల్లో పరిమిత పాత్రనే నిర్వహించాల్సి ఉంటుంది.

అలాగే, వైదిక విధానాల నిర్వహణలో ఏకాభిప్రాయం లేకపోతే పీఠాధిపతుల సలహాలను తీసుకునే వెసులుబాటు ఉంది. అర్చకులు ఆలయ ఆగమశాస్త్రాల ప్రకారం పూజలు నిర్వహించే స్వేచ్ఛ పొందారు.

ఈ నిర్ణయంతో అర్చకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు, వారు తమ ధార్మిక విధులను స్వేచ్ఛగా నిర్వహించేందుకు ఇది సహకారమని అభిప్రాయపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular