fbpx
Wednesday, February 5, 2025
HomeAndhra Pradeshతమ్ముడి మరణం.. కుటుంబానికి ధైర్యం చెప్పిన చంద్రబాబు

తమ్ముడి మరణం.. కుటుంబానికి ధైర్యం చెప్పిన చంద్రబాబు

chandrababu-mourns-brother-rammurthy-naidu-demise

హైదరాబాద్: తమ్ముడు నారా రామ్మూర్తినాయుడు అకాలమరణంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మహారాష్ట్రలో ఎన్డీయే తరఫున ఎన్నికల ప్రచార కార్యక్రమం నిమిత్తం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు, తన తమ్ముడి మరణ వార్త తెలియగానే హుటాహుటిన హైదరాబాద్‌కు చేరుకున్నారు.

హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి వచ్చిన చంద్రబాబు, తమ్ముడి భౌతికకాయానికి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా రామ్మూర్తినాయుడి కుమారులు నారా రోహిత్, గిరీష్‌లను ఆయన ఓదార్చారు. తమ తండ్రిని కోల్పోయిన ఆ ఇద్దరు యువకులకు చంద్రబాబు ధైర్యం చెబుతూ పక్కన నిలిచారు.

రామ్మూర్తినాయుడి భౌతికకాయానికి చంద్రబాబుతో పాటు నందమూరి బాలకృష్ణ, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నివాళులర్పించారు.

రామ్మూర్తినాయుడు మరణం తెలుగు రాజకీయాల్లో, నందమూరి-నారా కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నారా రామ్మూర్తినాయుడు తన స్నేహశీలత, సౌమ్యత్వంతో అందరి మన్ననలు పొందారు.

తెలుగుదేశం పార్టీలోనూ, కుటుంబంలోనూ ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. ఆయన మరణం నందమూరి, నారా కుటుంబ సభ్యులను తీవ్ర దుఃఖంలో ముంచేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular