fbpx
Thursday, September 19, 2024
HomeAndhra Pradeshవైకాపా నేత జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్‌ అరెస్ట్

వైకాపా నేత జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్‌ అరెస్ట్

CID- arrested- jogi-rajeev

అమరావతి: మాజీ మంత్రి, వైకాపా నేత జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలకు సంబంధించి ఆరోపణల నేపథ్యంలో ఆయన్ని అరెస్టు చేశారు. ఈ కేసులో రాజీవ్ ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు సమాచారం.

ఈ ఉదయం ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.

మంగళవారం ఉదయం 5 గంటల నుంచి 15 మంది ఏసీబీ అధికారుల బృందం ఆయన ఇంటికి చేరుకొని తనిఖీలు జరిపింది. సోదాల్లో కీలకమైన రికార్డులు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

జోగి రాజీవ్‌ను అరెస్టు చేసిన తరువాత, ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇది ప్రభుత్వ కక్ష పూరిత చర్య అని ఆరోపించారు. తన తండ్రిపై ఉన్న కక్షతోనే తనను అరెస్టు చేస్తున్నారని చెప్పారు. “మేము అందరూ కొనుగోలు చేసినట్టు, మేము కూడా భూములు కొన్నాం. అందులో తప్పేముందో నాకు అర్థం కావడం లేదు” అని అన్నారు.

జోగి రాజీవ్ ఈ కేసును చట్టపరంగా ఎదుర్కొంటామని, కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని స్పష్టం చేశారు.

గతంలో సీఐడీ అధికారుల దర్యాప్తులో జోగి రమేశ్‌పై భూములు కొనుగోలు చేసి విక్రయించిన ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదైంది.

ఈ ఘటన రాజకీయ రంగంలో హల్‌చల్ సృష్టిస్తోంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular