fbpx
Thursday, September 19, 2024
HomeTelanganaఢిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు

ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు

CM-Revanth-Reddy

తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయనతో పాటు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ కూడా కలిసి వెళ్ళనున్నారు.

కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం, వీరు రాత్రి 11 గంటలకు ఢిల్లీకి ప్రయాణిస్తారు.

ఢిల్లీలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ వంటి ముఖ్యాంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అలాగే, తెలంగాణ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన అభిషేక్ మను సింఘ్వీ ఎన్నికపై కూడా చర్చించనున్నట్టు సమాచారం.

రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కోసం రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలను ఆహ్వానించనున్నారు.

అదనంగా, వరంగల్‌లో నిర్వహించనున్న కృతజ్ఞత సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు.

ఈ సభలో పాలన, ప్రజాసంక్షేమ కార్యక్రమాలు, ఆరు గ్యారెంటీలు వంటి అంశాలపై చర్చ జరుగుతుందని అంచనాలు వున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular