fbpx
Monday, March 10, 2025
HomeAndhra Pradeshచంద్రబాబు కొత్త వ్యూహం.. ప‌దవుల్లో సామాజిక ప్రాధాన్యం

చంద్రబాబు కొత్త వ్యూహం.. ప‌దవుల్లో సామాజిక ప్రాధాన్యం

coalition-government-nominated-positions-social-groups


ఏపీ: కూట‌మి ప్రభుత్వం తాజాగా నామినేటెడ్ ప‌ద‌వుల‌ను వివిధ సామాజిక వ‌ర్గాల‌కు కేటాయించడం ద్వారా సామాజిక సమతుల్యానికి ప్రాధాన్యమిచ్చింది. ముఖ్యమంత్రి చంద్ర‌బాబు మొదటి దశలో 21 ప‌ద‌వులు కేటాయించి, తర్వాత మరిన్ని 51 ప‌ద‌వులు కూట‌మి నాయ‌కులకు అందజేశారు.

ఈ ప‌ద‌వుల్లో సామాజిక వ‌ర్గాల ప్రాతినిధ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. ముఖ్యంగా వైసీపీ నుంచి బయటకు వచ్చిన ఉండవల్లి శ్రీదేవికి మాదిగ సంక్షేమ మరియు ఆర్థిక కార్పొరేష‌న్ బాధ్యతలు అప్పగించడం ద్వారా మాదిగ వ‌ర్గం సంతృప్తి చెందింది.

అలాగే, కాపు వ‌ర్గానికి ప్రాధాన్యంగా కాపు కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌దవి జ‌న‌సేన నేత కొత్తపల్లి సుబ్బారాయుడుకు అందించడం చర్చనీయాంశంగా మారింది.

ఇంకా ఎస్టీ వ‌ర్గానికి చెందిన కిడారి శ్రావ‌ణ్‌కుమార్‌కు గిరిజన కో ఆప‌రేటివ్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ బాధ్యతలు అప్పగించడంతో గిరిజ‌న వ‌ర్గంలో ఆనందం వ్యక్తమవుతోంది.

అలాగే, బ్రాహ్మణ సామాజిక వర్గానికి చాగంటి కోటేశ్వ‌ర రావుకు నైతిక విలువల సలహాదారు ప‌దవిని కేబినెట్ ర్యాంకుతో కేటాయించడం ద్వారా చంద్ర‌బాబు బ్రాహ్మణ వర్గానికి నమ్మకం కల్పించారు.

ఇక, టీడీపీ పట్ల విధేయంగా ఉన్న ప‌లువురు నేతలకు, ముఖ్యంగా మ‌హ్మ‌ద్ షరీఫ్, పట్టాభి కొమ్మారెడ్డి, ఆనం వెంక‌ట ర‌మ‌ణారెడ్డి, వంటి వారికి కీలక పదవులు ఇవ్వడం ద్వారా పార్టీ కోసం క‌ష్ట‌ప‌డి ప‌నిచేసిన వారికి ప్రాధాన్యం ఉంటుందని చంద్ర‌బాబు చూపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular