fbpx
Thursday, September 19, 2024
HomeBig Storyచత్తీస్గఢ్ రాయ్పూర్ లో సంపూర్ణ లాక్ డౌన్!

చత్తీస్గఢ్ రాయ్పూర్ లో సంపూర్ణ లాక్ డౌన్!

COMPLETE-LOCKDOWN-IN-CHATTISGARH-CAPITAL-RAIPUR

రాయ్‌పూర్‌: కరోనా మహమ్మారి కేసులు ఎక్కువగా పెరుగుతున్న రాష్ట్రాల్లో ఛత్తీస్‌గడ్ కూడా ముందంజలో‌నే ఉంది. అందువల్ల ఆ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాప్తి కట్టడికి చర్యలు తీవ్రం చేసింది. దీనిలో భాగంగా రాష్ట్ర రాజధాని అయిన రాయ్‌పూర్‌లో సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

ఈ సంపూర్ణ లాక్ డౌన్ ను ఏప్రిల్‌ 9వ తేదీ నుంచి 19 వరకు మొత్తం అమలు‌ చేస్తున్నట్లు బుధవారం ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు పది వేలకు చేరువగా కేసులు నమోదవుతుండడంతో ప్రభుత్వం కరోనా కట్టడి కోసం తీవ్ర ఆంక్షలు విధిస్తోంది.

మంగళవారం ఒక్కరోజే ఛత్తీస్‌గడ్‌లో 9,921 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ జరిగాయి. పైగా వాటిలో అత్యధికంగా రాజధాని రాయ్‌పూర్‌లోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి భూపేశ్‌ బాఘేల్‌ వైద్య ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్‌ కట్టడి చర్యలపై సుదీర్ఘంగా సమీక్షించారు.

ఈ నేపథ్యం లో రాజధానిలో లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇప్పటికే ఏప్రిల్‌ 6వ తేదీ నుంచి 14 వరకు రాష్ట్రంలోని దుర్గ్‌ జిల్లాలో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేశారు. ఛత్తీస్‌గడ్‌లో మొత్తం కేసులు 3,86,269 ఉండగా వాటిలో యాక్టివ్‌ కేసులు 52,445 ఉన్నాయి. ఇప్పటివరకు కరోనాతో 4,416 మంది మృతి చెందారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular