హైదరాబాద్: కరోనా విజృంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎప్పుడు తగ్గుతుందో కూడా తెలియని పరిస్థితి. రోజు కొత్త కేసుల సంఖ్య వేలల్లో ఉంటంది. కాపాడే వ్యాక్సిన్లు ఇంకా తయారు కాలేదు.
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం కోసం ప్రపంచమంతా యుద్ధప్రాతిపదికన ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే వైరస్ కిల్లర్ అనే పరికరాన్ని శుక్రవారం తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆవిష్కరించారు.
ప్రపంచాన్ని సార్స్, ఎబోలా, కరోనా పట్టి పీడిస్తున్న తరుణంలో వాటిని నాశనం చేయడానికి దక్షిణ కొరియా ఈ పరికరాన్ని రూపొందించింది. ఈ పరికరం గాలిలో ఉన్న వైరస్ను తనలోకి లాక్కొంటుంది, తద్వారా వాటిని అంతం చేయడం ద్వారా దానిని నిర్మూలిస్తుంది.
ఉర్జా క్లీన్ టెక్ సంస్థ దేశవ్యాప్తంగా ఈ పరికరానికి సేల్స్ అండ్ సర్వీస్ సేవలు అందిస్తోంది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మధుసూదనరావు, వైస్ ప్రెసిడెంట్ విష్ణు భరద్వాజ్లు మంత్రి ఈటల రాజేందర్ కు ఈ పరికరం గురించి వివరించారు.
ఈ పరికరం ఉన్న పరిసరాల్లో ఉన్నవారికి ఎటువంటి వ్యాధులు సంక్రమించవని వారు ఈ సందర్భంగా తెలిపారు. సెమినార్ హాళ్లు, తరగతి గదుల వంటి వచోట్ల ఇది ఎక్కువగా ఉపయోగపడుతుందన్నారు. అలాగే ఆస్పత్రులు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లలో ఈ పరికరాలు చాలా ఉపయోగకరమని పేర్కొన్నారు.