fbpx
Sunday, February 23, 2025
HomeAndhra Pradeshఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల్లో భారీ తగ్గుదల నమోదు

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల్లో భారీ తగ్గుదల నమోదు

COVID-CASES-DECLINE-IN-ANDHRAPRADESH-IN-LAST-24HOURS

అమరావతి: ఏపీ‌లో కరోనా వైరస్ కేసులు బాగా తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో నిన్న నమోదు అయిన కేసులు 18,767 గా ఉండగా, ఇవాళ నమోదైన కేసులు కేవలం 12,994 గా నమోదయ్యాయి. కాగా రాష్ట్రంలో గత 24 గంటల్లో 58,835 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 12,994 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 15,90,926 మందికి కరోనా సోకింది. అయితే ఒక్కరోజే కరోనా బారిన పడి 104 మంది మరణించారు.

అలాగే గత 24 గంటల్లో 18,373 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా ఇంటికి డిశ్చార్జ్‌ అవ్వగా, మొత్తంగా 13 లక్షల 79 వేల 837 మంది కోవిడ్ నుండి కోలుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం కరోనాపై తాజా హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 2,03,762 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 1,86,76,222 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.

అలాగే గత 24 గంటల్లో కరోనా మరణాలపై వైద్యారోగ్యశాఖ నివేదిక విడుదల చేసింది. అందులో 60-80 ఏళ్ల మధ్య వృద్ధుల్లో కరోనా మరణాలు తగ్గిన్నట్లు తెలిపారు. సెకండ్‌ వేవ్‌లో 30-50 ఏళ్ల మధ్య ఎక్కువగా చనిపోతున్నట్లు వారు ధృవీకరించారు. ఇక గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ సమానంగా కరోనా మరణాలు నమోదవుతున్నట్లు తెలిపారు.

అర్బన్ ప్రాంతంలో 50.4 శాతం, పల్లెల్లో 49.6 శాతం మరణాలున్నట్లు వెల్లడించారు. రెండో దశ కరోనాలో 41-50 మధ్య వారు ఎక్కువగా మృతి చెందినట్లు నిర్థారించారు. గతేడాది మొదటి వేవ్‌తో పోలిస్తే సెకండ్‌ వేవ్‌లో 41-50 మధ్య వయస్సులో 5.96 శాతం మేర కరోనా మరణాలు పెరిగాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular