హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో 2021-22 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సోమవారం ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాలు వెల్లడైన వెంటనే ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జూలై 1వ తేదీ నుంచి వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునేలా సిద్ధం చేస్తోంది.
టీ-యాప్ ఫోలియో మొబైల్ యాప్ ద్వారా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీని కోసం విద్యార్థి యొక్క ఇంటర్ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ, ఆధార్, ఫోన్ నంబర్ తో సహా నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం 105 హెల్ప్ లైన్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.డిఓఎస్టీ.సీజీజీ.జీఓవి.ఐఎన్ ద్వారా అడ్మిషన్లు జరుగుతాయి.
ముఖ్యమైన తేదీలు: జులై 1 నుంచి 15 వరకు తొలి విడత రిజిస్ట్రేషన్లు, ఫీజు రూ.200, జులై 3 నుంచి 16 వరకు వెబ్ ఆప్షన్లు, జులై 22న సీట్ల కేటాయింపు, జులై 23 నుంచి 27 వరకు రెండో విడత రిజిస్ట్రేషన్లు, ఫీజు రూ.400, జులై 24 నుంచి 29 వరకు వెబ్ ఆప్షన్లు, ఆగస్టు 4న సీట్ల కేటాయింపు, ఆగస్టు 5 నుంచి 10 వరకు మూడో విడత రిజిస్ట్రేషన్లు, ఫీజు రూ.400, ఆగస్టు 6 నుంచి 11 వరకు వెబ్ ఆప్షన్లు, ఆగస్టు 18న సీట్ల కేటాయింపు.