చంఢీఘర్: సాగర్ రాణా జూనియర్ రెజ్లర్ యొక్క హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత సీనియర్ రెజ్లర్ సుశీల్ కుమార్ను ఈ రోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుశీల్ కుమర్ పంజాబ్లో ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న ఢిల్లీ పోలీసులు అతనితో పాటు మరో అనుమానితుడు అజయ్ కుమార్ను కూడా అరెస్ట్ చేశారు. సాగర్ హత్య కేసును విచారించేందుకు పోలీసులు వారిద్దరిని ట్రాన్సిట్ వారంట్పై ఢిల్లీకి తీసుకు వెళ్ళనున్నారు.
మే4 వ తేదీన సాగర్ రాణా ఢిల్లీ ఛత్రసాల్ స్టేడియంలో దారుణ హత్యకు గురయ్యాడు. సుశీల్ మరియు సాగర్ ల మధ్య జరిగిన ఘర్షణలో రాణా హత్యకు గురైనట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. ఆ హత్య జరిగినప్పటి నుండి అజ్థాతంలోకి వెళ్లిపోయిన సుశీల్ కుమార్ను పట్టుకునేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నం చేశారు.
కాగా దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న రెజ్లర్ సుశీల్ కుమార్పై రూ. లక్ష రూపాయలు, సహచరుడు అజయ్పై రూ.50 వేల రివార్డును కూడా పోలీసులు ప్రకటించారు. దీంతోపాటు గతవారం సుశీల్ కుమార్ అప్పీల్ చేసుకున్న ముందస్తు బెయిల్ పిటీషన్ను ఢిల్లీ రోహిణి కోర్టు కూడా కొట్టివేసింది.
తప్పించుకు తిరుగుతున్న సుశీల్ రెండురోజుల క్రితం తన కారులో ఉత్తర్ ప్రదేశ్లోని మీరట్ టోల్ ప్లాజా వద్ద ఉన్న కెమెరాలకు చిక్కిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఈ ఆధారంతో సుశీల్ కోసం వేట కొనసాగించిన ఢిల్లీ పోలీసులు చివరికి సుశిల్ ను పంజాబ్లో అరెస్ట్ చేశారు.