జమ్మూ: పదేళ్ల తర్వాత జమ్మూలో ఎన్నికలు జరుగుతున్నాయి. భారతదేశంలో లో అత్యంత సమస్యాత్మక ప్రాంతం అయిన జమ్మూ కశ్మిర్లో పోలింగ్ కొనసాగుతోంది .
కాగా, 2019లో ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దాని తరువాత తొలి సారి జరుగుతున్న ఎన్నికలు అవడంతో ఇప్పుడు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.
కశ్మీర్ లోయలో ఇవాళ తొలి విడత పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 41.17 శాతం పోలింగ్ నమోదైంది.
జమ్ము కశ్మీర్ అసెంబ్లీలో మొత్తం 90 స్థానాలు ఉండగా… తొలి విడతలో 24 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. 24 స్థానాల్లో 219 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
సాయంత్రం 6 గంటలకు పోలింగ్ జరగనుంది. ఉగ్రవాద దాడుల నేపథ్యంలో, జమ్ము కశ్మీర్ వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. తనిఖీలు ముమ్మరం చేశారు.