fbpx
Saturday, October 26, 2024
HomeAndhra Pradeshఉచిత గ్యాస్‌ పంపిణీపై కీలక ప్రకటన: నాదెండ్ల మనోహర్

ఉచిత గ్యాస్‌ పంపిణీపై కీలక ప్రకటన: నాదెండ్ల మనోహర్

free-gas-supply-ap-nadendla-manohar

అమరావతి: ఏపీలో దీపావళి సందర్బంగా ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పంపిణీకి సంబంధించి పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ రోజు సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో, ఈ నెల 29 నుంచి ఉచిత గ్యాస్ బుకింగ్స్ ప్రారంభమవుతాయని ప్రకటించారు.

వినియోగదారులు ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయిల్ కంపెనీలకు రూ. 894 కోట్లు అందిస్తామని, ఈ నెల 29న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేస్తామని నాదెండ్ల మనోహర్ చెప్పారు.

సిలిండర్ బుక్ చేసుకున్న వెంటనే వినియోగదారులకు సాంకేతిక ఆధారంగా సమాచారాన్ని పంపుతామని వివరించారు. అయితే బుకింగ్ అయిన 24 నుంచి 48 గంటల్లో సిలిండర్‌ను డెలివరీ చేయడం జరిగేలా ఆయిల్ కంపెనీలు ఏర్పాట్లు చేసుకున్నాయని తెలిపారు.

పట్టణ ప్రాంతాల్లో అయితే 24 గంటల్లోనే డెలివరీ చేస్తామని పేర్కొన్నారు. సిలిండర్ అందిన క్షణం నుంచి 48 గంటల్లోపు వారి ఖాతాల్లో నగదు జమ అవుతుందని, ఈ సౌకర్యం వినియోగదారుల సౌకర్యం కోసం తీసుకొచ్చినట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular