fbpx
Saturday, October 19, 2024
HomeTelanganaసింగరేణి లో ఉద్యోగాల పేరిట ఘరానా మోసం.. దంపతుల బలి!

సింగరేణి లో ఉద్యోగాల పేరిట ఘరానా మోసం.. దంపతుల బలి!

Gharana-fraud-in-the-name-of-jobs-in-Singareni-Couples-suicide

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం సాయిరాం తండాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. సింగరేణి సంస్థలో ఉద్యోగాలు వస్తాయని నమ్మి, అప్పు చేసి డబ్బు చెల్లించి దారుణంగా మోసపోయిన హలావత్ రత్న కుమార్, అతని భార్య పార్వతిలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశలు కల్పించి, దంపతుల నుంచి రూ. 16 లక్షలు తీసుకున్నాడు.

అయితే, వాస్తవానికి ఎన్నాళ్ళు ఎదురుచూసిన ఉద్యోగాలు రాకపోవడం, అప్పులు కట్టలేకపోవడం, వడ్డీలు పెరిగిపోవడం వల్ల వారి జీవితాలు దుర్భరం కావడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. అందులోనూ అప్పులవాళ్ళ ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో, ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

ఘటన వివరాలు
మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగిన దంపతులను హైదరాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ వారు ఇద్దరు కూడా ఇవాళ మరణించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular