fbpx
Monday, April 14, 2025
HomeTelanganaతెలంగాణ రాష్ట్ర పోలీసులకు తీపి కబురు

తెలంగాణ రాష్ట్ర పోలీసులకు తీపి కబురు

GOODNEWS-FOR-TS-POLICE-ON-HOMELOANS

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పోలీసు సిబ్బందికి రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి తీపి కబురును అందించారు. డిపార్ట్ మెంట్ లోని కానిస్టేబుల్‌ నుంచి ఐపీఎస్‌ అధికారి వరకు అందరికీ ఇంటి రుణ పరిమితిని పెంచుతూ, అదే సమయంలో రుణాల వడ్డీని కూడా తగ్గిస్తూ నిర్ణయం తెలిపారు. మంగళవారం డీజీపీ ఆధ్వర్యంలో జరిగిన భద్రత, ఆరోగ్య భద్రత ట్రస్ట్‌ బోర్డు మీటింగ్‌లో ప్లాటు కొనుగోలు వడ్డీరేటును 7.5 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గించారు.

పోలీసు సిబ్బంది వారి పిల్లల విదేశీ విద్యా రుణాలను అన్ని హోదాల్లో ఉన్న వారికి రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు పెంపుదల చేశారు. ఈ నిర్ణయంతో డీజీపీకి తెలంగాణ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.గోపిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కానిస్టేబుల్‌ నుంచి ఏఎస్సై స్థాయి దాకా రూ. 35 లక్షల నుంచి 40 లక్షలు, ఎస్సై నుంచి సీఐ వరకు రూ. 45 లక్షల నుంచి 50 లక్షలు, డీఎస్పీ నుంచి ఏఎస్పీ వరకు రూ.55 లక్షల నుంచి 60 లక్షలు, ఐపీఎస్‌లకు రూ.65 లక్షల నుంచి రూ.70 లక్షలకు రుణ పరిమితి పెంచారు.

కానిస్టేబుల్‌ నుంచి ఏఎస్సై వరకు రూ. 20 లక్షల నుంచి 25 లక్షలు, ఎస్సై నుంచి సీఐ వరకు రూ. 25 లక్షల నుంచి రూ.30 లక్షలు, డీఎస్పీ నుంచి ఏఎస్పీ వరకు రూ.30 నుంచి రూ.35 లక్షలు, ఐపీఎస్‌లకు రూ.40 లక్షల నుంచి 45 లక్షలకు రుణ పరిమితిని పెంచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular