fbpx
Saturday, September 7, 2024
HomeAndhra Pradeshఏపీలో ఏప్రిల్ 1 నుండి ఒంటి పూట బడులు ప్రారంభం

ఏపీలో ఏప్రిల్ 1 నుండి ఒంటి పూట బడులు ప్రారంభం

HALFDAY-SCHOOLS-FROM-APRIL1ST-IN-ANDHRAPRADESH

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెల ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి బడులను ఒంటిపూట నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ సోమవారం విడుదల చేశారు. ఆ రాష్ట్రంలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ఒక్కపూట మాత్రమే తరగతులు నిర్వహించనున్నామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

1వ తేదీ నుండి బడులు ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మాత్రమే పని చేస్తాయి. బడులలో మే 31వ తేదీ వరకు తరగతులు నిర్వహించనున్నారు. పదో తరగతి విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షలు జూన్‌లో ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయి.

రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు మరియు కరోనా కేసుల పరిస్థితుల నేపథ్యంలో తరగతులు ముగిసిన తరువాత పాఠశాల నుంచి విద్యార్థులను క్షేమంగా ఇళ్లకు చేర్చటంపై ఉపాధ్యాయులు తగిన శ్రద్ధ తీసుకోవాలని మంత్రి సూచించారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పాఠశాలల్లో కూడా కోవిడ్‌ నిబంధనలు అమలుకు ప్రత్యేక చర్యలు తీసుకునేలా అధికారులకు ఆదేశాలు జారీచేశామని చెప్పారు.

అలాగే పాఠశల విద్యార్థులకు కూడా కోవిడ్‌ పరీక్షలు నిర్వహణ, మాస్క్‌ లు ధరించడం, శానిటైజర్‌ వినియోగం, భౌతిక దూరం పాటించేలా తగు రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించామని తెలిపారు. పాఠశాలల్లో కోవిడ్‌ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై ప్రతి జిల్లా నుంచి నివేదికలు తెప్పిస్తున్నామని, ఎక్కడా ఇబ్బంది రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular