fbpx
Sunday, October 27, 2024
HomeAndhra Pradeshఏపీలో ఇళ్ళ పట్టాల పంపిణీ డిసెంబర్ 25న

ఏపీలో ఇళ్ళ పట్టాల పంపిణీ డిసెంబర్ 25న

HOUSE-PATTAS-ON-DECEMBER-25TH-IN-AP

తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం​ డిసెంబర్‌ 25న ప్రారంభం కానుంది. కోర్టు స్టే ఉన్న ప్రాంతాల్లో మినహా మిగతా అన్ని చోట్ల ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.

ఈ సంవత్సరం డిసెంబర్‌ 25న అర్హులైన వారందరికీ డి-ఫామ్‌ పట్టా ఇచ్చి వారికి ఇళ్ళ స్థలాలు కేటాయించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 30,68,281 మంది లబ్ధిదారులను ప్రభుత్వం గుర్తించింది. ఇప్పుడు వీరందరికి పట్టాలు అందించడంతో పాటు అదే రోజు ఇళ్ల నిర్మాణాలు మెదలుకానున్నాయి. తొలి దశలో దాదాపు 15 లక్షల ఇళ్ల స్థలాల నిర్మాణం చేపట్టనున్నారు.

ఈ పంపిణీ ఇప్పటికే జూలై 8నే ఇచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇళ్ళ పట్టాల పంపిణీ పై కొందరు కోర్టుకు వెళ్లడంతో పలుమార్లు ఈ కార్యక్రమం వాయిదా పడింది. ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సంబంధించిన కాలనీలను ప్రభుత్వం ఎప్పుడో రూపొందించింది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇవ్వబోయే స్థలాలు గతంలోలా బలహీన వర్గాల గృహ సముదాయంలా ఉండదు.

విశాలమైన రోడ్లు, పార్కులు, పాఠశాలలు, ఆసుపత్రులు, ఇతర సామాజిక అవసరాల కోసం స్థలాలు కేటాయించారు. ఇల్లు లేదనే వారు ఉండకుండా సంతృప్త స్థాయిలో అర్హులందరికీ ఇళ్ల పట్టాలు అందజేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular