fbpx
Friday, October 18, 2024
HomeLife Styleఐరాస ద్వారా హైదరాబాద్ కు ట్రీ సిటీగా గుర్తింపు

ఐరాస ద్వారా హైదరాబాద్ కు ట్రీ సిటీగా గుర్తింపు

HYDERABAD-RECOGNIZED-TREE-CITY-BY-UNO-FAO

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రం తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్‌ను ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని ఎఫ్‌ఏవో
ట్రీ సిటీగా గుర్తించిందని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి శాసనసభలో వెల్లడించారు. ఇది రాష్ట్రానికి ఎంతో గర్వకారణమని ఒక హరితహారం విజయమని ఆయన అన్నారు.

శాసనసభలోని సభ్యులు యాదగిరిరెడ్డి, రేఖా నాయక్‌లు అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ రీడిజైనింగ్‌ చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ సభ్యుడు యాదగిరిరెడ్డి ప్రశంసించారు. ఇక ఇంద్రకరణ్‌రెడ్డి సమాధానం చెబుతూ రాష్ట్రంలోని అన్ని రకాల విద్యా సంస్థలను 100 శాతం గ్రీనరీగా అభివృద్ధి చేయాడం తమ లక్ష్యంగా ఉందని అన్నారు.

2015 నుంచి ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 179.08 కోట్ల మొక్కలు నాటామని, ఈ సంఖ్య పునరుజ్జీవనంతో కలిపి మొత్తం 217 కోట్ల మొక్కలు ఇప్పుడు నిలబడ్డాయన్నారు. విద్యుత్‌శాఖ వారు చెట్ల కొమ్మలు నరకకుండా తగు ఆదేశాలు జారీ ఇస్తామన్నారు. 10,750 గ్రామ పంచాయతీల్లో నర్సరీలు ఉన్నాయని, దేశంలో ఎక్కడా ఈ పరిస్థితి లేదని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular