fbpx
Thursday, September 19, 2024
HomeAndhra Pradeshఏపీలో సైన్స్ ల్యాబ్‌లో విద్యార్థులకు అస్వస్థత

ఏపీలో సైన్స్ ల్యాబ్‌లో విద్యార్థులకు అస్వస్థత

Illness-for-students-in-science-lab-AP

అమరావతి: ఏపీలో బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో దురదృష్టకరమైన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

శనివారం 6, 7వ తరగతుల విద్యార్థులు సైన్స్ ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

పరీక్ష సమయంలో, విద్యార్థులు క్లోరోక్విన్ మరియు లెమన్ సోడాలో సోడియం కలపడంతో అనుకోని రీతిలో విషవాయువులు వెలువడటంతో 24 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

ఈ సమయంలో, ప్రయోగం జరుగుతుండగా, టీచర్ ల్యాబ్ నుండి బయటకు వెళ్లిపోయారు, దీంతో ప్రమాదం మరింత తీవ్రమైంది.

దీంతో అస్వస్థతకు గురైన విద్యార్థులను ఉపాధ్యాయులు తక్షణమే ఆస్పత్రికి తరలించి, చికిత్స అందజేశారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జిల్లా అధికారులు మరియు వైద్యులతో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు.

వైద్యాధికారుల ప్రకారం, విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాణాపాయం లేదని సిఎంకు వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular