fbpx
Saturday, April 26, 2025
HomeInternationalదక్షిణాఫ్రికా తో రెండవ టెస్టులో భారత్ ఓటమి!

దక్షిణాఫ్రికా తో రెండవ టెస్టులో భారత్ ఓటమి!

INDIA-LOST-2ND-TEST-WITH-SOUTHAFRICA

జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో వాండరర్స్‌లో భారత్ మరియు దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండవ టెస్టులో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించి మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 1-1 తో సమం చేసింది.

దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ 96 పరుగులు చేసి అజేయంగా నిలవడంతో ఆతిథ్య జట్టును ఒంటిచేత్తో గెలిపించి హీరోగా నిలిచాడు. ఎల్గర్ భారత బౌలర్ల ముందు బలంగా బ్యాటింగ్ చేసి 240 పరుగుల ఛేదనలో బలమైన గోడలా నిలిచాడు.

భారత్ బౌలర్ల‌లో మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, మరియు రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ ఫలితం వల్ల తరువాత కేప్ టౌన్‌లోని న్యూలాండ్స్‌లో జరిగే మూడవ టెస్టు సిరీస్ నిర్ణయాత్మక టెస్టుకు మారనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular