fbpx
Saturday, February 22, 2025
HomeSportsభారత్ vs పాక్: హై ఓల్టేజ్ మ్యాచ్‌పై ఉత్కంఠ

భారత్ vs పాక్: హై ఓల్టేజ్ మ్యాచ్‌పై ఉత్కంఠ

india pakistan high voltage clash in champions trophy 2025

దుబాయ్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో క్రికెట్ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూసే మ్యాచ్ ఆదివారం (ఫిబ్రవరి 23) జరగనుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు రెండు దేశాల అభిమానులు భారీగా హాజరవుతారని అంచనా.

గత ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్ చేతిలో భారత్ ఓటమి చెందడంతో, ఈసారి టీమిండియా బదులు తీర్చుకోవాలని కృతనిశ్చయంతో ఉంది. ఈ క్రమంలో భారత జట్టు నేడు ప్రాక్టీస్ సెషన్‌లో బిజీగా గడిపింది.

బీసీసీఐ విడుదల చేసిన ఫొటోలలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్ మాన్ గిల్, హార్దిక్ పాండ్యా ఉత్సాహంగా కనిపించారు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, షమీ, జడేజా కష్టపడి ప్రాక్టీస్ చేశారు.

ఇక పాక్ జట్టు కూడా తమ ప్రాక్టీస్‌ను ముమ్మరం చేసింది. కెప్టెన్ బాబర్ అజామ్, రిజ్వాన్, షాహిన్ అఫ్రిది ఫిట్‌గా ఉండాలని కృషి చేస్తున్నారు. రేపటి మ్యాచ్‌లో గెలిచేది ఎవరో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular