fbpx
Sunday, February 23, 2025
HomeNationalదేశంలో ఇవాళ 1,32,364 కరోనా కేసులు

దేశంలో ఇవాళ 1,32,364 కరోనా కేసులు

INDIA-RECORDS-1.3LAKH-CASES-IN-LAST-24HOURS

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్‌ రెండో దశ విజృంభణ కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కేసుల నమోదులో ఒక రోజు తగ్గుముఖం మరో రోజు పెరుగుదల కనిపిస్తున్నాయి. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 1,32,364 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇవాళ్టి కరోనా బులెటిన్‌లో తెలిపింది.

అలాగే 24 గంటల్లో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 2713 గా ఉంది. ఇక కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. దానితో పాటు 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 2,07,071 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. వీరితో కలిపి ఇప్పటివరకు 2,65,97,655 మంది సురక్షితంగా డిశ్చార్జ్‌ అయ్యారు.

దేశం మొత్తం ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న కేసులు 16,35,993. 24 గంటల్లో 20,75,428 మందికి కరోనా పరీక్షలు చేయగా వీటిని కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు జరిపిన పరీక్షలు 35,74,33,846. టీకాల పంపిణీ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది.

దేశంలో 140 రోజులుగా కొనసాగుతోన్న కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఇంకా కొనసాగుతోంది. నిన్న దేశవ్యాప్తంగా 28,75,286 మందికి వ్యాక్సినేషన్‌ జరిగింది. దేశంలో ఇప్పటివరకు వ్యాక్సిన్‌ పొందిన వారు 22,41,09,448 మంది ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular