బెంగళూరు: India vs Newzealand: రచిన్ రవీంద్ర మరియు విల్ యంగ్ మధ్య శక్తివంతమైన భాగస్వామ్యం న్యూజిలాండ్ను మూడు టెస్ట్ల సిరీస్లో తొలి మ్యాచ్లో భారత్పై ఎనిమిది వికెట్ల విజయానికి సహాయం చేసింది.
107 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆరంభంలోనే తమ కెప్టెన్ టామ్ లాథమ్ను డక్ అవుట్ గా కోల్పోయింది.
కానీ, డెవన్ కాన్వే (17) మరియు విల్ యంగ్ (45*) భాగస్వామ్యం కివీస్ ను గేమ్లోకి తీసుకువచ్చింది.
తరువాత కాన్వేను కోల్పోయినప్పటికీ, రచిన్ రవీంద్ర (39*) మ్యాచ్ను విజయవంతంగా ముగించాడు.
ఇదిలా ఉండగా, భారత్ బౌలర్లలో జస్ప్రిత్ బుమ్రా రెండు వికెట్లు తీసాడు.
అంతకుముందు, భారత ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ 150 పరుగులు చేయగా, రిషభ్ పంత్ 99 పరుగులతో రాణించాడు.
అయితే, 1988 తర్వాత భారతదేశంలో న్యూజిలాండ్కు టెస్ట్ మ్యాచులో ఇది మొదటి విజయం.