fbpx
Sunday, September 8, 2024
HomeNationalనేపాల్ పై విజయంతో సెమీస్ కి భారత మహిళల టీం!

నేపాల్ పై విజయంతో సెమీస్ కి భారత మహిళల టీం!

INDIA-WOMENS-BEAT-NEPAL-ENTER-SEMIFINALS-WOMENS-ASIA-T20-CUP
INDIA-WOMENS-BEAT-NEPAL-ENTER-SEMIFINALS-WOMENS-ASIA-T20-CUP

డంబుల్లా: షఫాలి వర్మ 48 బంతుల్లో 81 పరుగులు అధ్బుత ప్రదర్శనతో మంగళవారం దంబుల్లాలో జరిగిన వుమెన్స్ ఆసియా కప్ టి20 టోర్నమెంట్‌లో భారత మహిళల టీం నేపాల్‌పై 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సెమీఫైనల్‌ చేరింది.

కాగా, బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేసిన ఇండియా, స్మృతి మంధాన టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంతో షఫాలి మరియు డయాలాన్ హేమలత (47) ఇన్నింగ్స్‌కు శుభారంభాన్ని ఇచ్చారు.

ఈ జంట 14 ఓవర్లలో 122 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ ఆ తర్వాత 15 బంతుల్లో 28 పరుగులు చేసి, చివరి ఓవర్‌లో మూడు ఫోర్లు కొట్టి, ఇండియాను 178/3 పరుగుల వద్ద నిలిపారు.

నేపాల్‌కు సెమీఫైనల్స్‌లో అర్హత సాధించడానికి 10 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకోవాలి కానీ వారు 20 ఓవర్లలో 96/9 మాత్రమే చేయగలిగారు, ఇందుకు కారణం ఇండియన్ బౌలింగ్ దళం అద్భుత ప్రదర్శన.

దీప్తి శర్మ (3/13) ఇండియాకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచారు, తన స్పిన్ సహచరురాలు రాధా యాదవ్ (2/12) మరియు సీమర్ అరుంధతి రెడ్డి (2/18) రెండేసి వికెట్లు తీసారు.

దీంతో పాకిస్తాన్ గ్రూప్ ఏ నుండి సెమీఫైనల్స్‌కు అర్హత పొందిన రెండవ జట్టుగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular