fbpx
Wednesday, September 18, 2024
HomeBusinessస్టాక్ మార్కెట్ సూచీలు జీవితకాల గరిష్ఠానికి చేరువ!

స్టాక్ మార్కెట్ సూచీలు జీవితకాల గరిష్ఠానికి చేరువ!

INDIAN-SENSEX-REACHES-ALL-TIME-HIGH
INDIAN-SENSEX-REACHES-ALL-TIME-HIGH

ముంబై: భారత స్టాక్ మార్కెట్ సూచీలైన సెన్సెక్స్ మరియు నిఫ్టీ ఇవాళ జీవితకాల గరిష్ఠాలకు చేరువ లోకి రావడం జరిగిమి.

కానీ చివర్లో ముగింపు సమయానికి కేవలం స్వల్ప లాభాలతోనే సరిపెట్టుకునే పరిస్థితి వచ్చింది.

సెన్సెక్స్ కేవలం 97 పాయింట్ల వృద్ధితో 82,988 వద్ద ముగిసింది, కాగా నిఫ్టీ 27 పాయింట్ల లాభంతో 25,383 వద్ద నిలిచింది.

అయితే ఒకానొక దశలో సెన్సెక్స్ జీవితకాల గరిష్ఠం అయిన 83,184 పాయింట్లను తాకింది, అలాగే నిఫ్టీ కూడా అదే బాటలో జీవితకాల గరిష్ఠం 24,445 వరకు పెరిగింది.

కానీ, మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ఊహించని కొనుగోళ్ల ట్రెండ్ మొదలవడంతో సూచీలు కొద్దిపాటి లాభాలకే పరిమితం కావాల్సి వచ్చింది.

ఇదిలా ఉండగా నేడు మెటల్, రియాల్టీ, ఎనర్జీ, వస్తు, మౌలిక సదుపాయాల రంగంలోని కంపెనీలు లాభాల బాటలో వెళ్ళగా, మిగిలిన ఇతర సెక్టార్లు ఐటీ, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ, ఫార్మా కంపెనీల షేర్లు నష్టాలను చవి చూశాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular