fbpx
Sunday, February 23, 2025
HomeBusinessరూ.1000 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఇండిగో పెయింట్స్ ఐపీఓ

రూ.1000 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఇండిగో పెయింట్స్ ఐపీఓ

INDIGO-PAINTS-FILES-IPO-FOR-1000-CRORES

ముంబై: సీక్వోయా క్యాపిటల్‌ అండగా భారత దేశ మార్కెట్లో కార్యకలాపాలను విస్తరించిన ఇండిగో పెయింట్స్‌ పబ్లిక్‌ ఇష్యూ కోసం ముందడుగు వేసింది. దీని కోసం అనుమతి కోరుతూ మార్కెట్ల నియంత్రణ సంస్థ అయిన సెబీకి దరఖాస్తు చేసింది. ఐపీవోలో భాగంగా సీక్వోయా క్యాపిటల్‌ 58.4 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనుంది.

ఇంకా వీటికి అదనంగా రూ. 300 కోట్ల విలువచేసే ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. ప్రమోటర్‌ హేమంత్‌ జలాన్‌ సైతం కొంతమేర తన వాటాను విక్రయించనున్నారు. తద్వారా కంపెనీ రూ. 1,000 కోట్లను సమీకరించే యోచనలో ఉంది.

ఇండిగో పెయింట్స్‌ విడుదల చేసిన ప్రాస్పెక్టస్‌ ప్రకారం ఐపీవో నిధులను కంపెనీకున్న తయారీ ప్లాంట్ల విస్తరణ కోసం ప్రధానంగా వినియోగించనుంది. తమళినాడులోని పుదుకొట్టాయ్‌లోగల ప్లాంటు తయారీ సామర్థ్యాన్ని ఈ నిధుల ద్వారా పెంచనుంది. మరికొన్ని నిధులను రుణ చెల్లింపులకూ వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కంపెనీ పొందుపరిచింది.

పుణేకు చెందిన ఇండిగో పెయింట్స్‌ ప్రధానంగా వివిధ డెకొరేటివ్‌ పెయింట్లను రూపొందిస్తోంది. దేశవ్యాప్తంగా పంపిణీ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. కంపెనీకి తమిళనాడు, రాజస్తాన్‌, కేరళలలో మొత్తం మూడు తయారీ యూనిట్లు ఉన్నాయి. పబ్లిక్‌ ఇష్యూకి కొటక్‌ మహీంద్రా క్యాపిటల్‌, ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ బుక్‌రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్స్‌గా వ్యవహరించనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular