fbpx
Thursday, September 19, 2024
HomeAndhra Pradeshకార్యకర్తలకు వైసీపీ అధినేత జగన్ భరోసా

కార్యకర్తలకు వైసీపీ అధినేత జగన్ భరోసా

Jagan-assures-activists

అమరావతి: కార్యకర్తలకు వైసీపీ అధినేత జగన్ భరోసా! అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నిశ్శబ్దంగా ఉన్న తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం తిరిగి తెరచుకుంది. బుధవారం, ఆ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు కార్యాలయానికి వెళ్లి అధినేత జగన్‌ను కలిశారు.

ఈ సందర్భంగా, జగన్ ఎన్నికల అనంతరం ఎదురైన ఇబ్బందులు, క్షేమ సమాచారం గురించి కార్యకర్తలతో చర్చించారు.

“అన్నీ సర్దుకుంటాయంటూ” ఈ సందర్భంలో జగన్ హామీ ఇచ్చారు. పార్టీ అండగా ఉంటుందని, అధైర్య పడొద్దని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. పలువురు కార్యకర్తలు తమకు ఎదురైన ఇబ్బందులను జగన్‌కు వివరించారు.

అంతేకాక, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయని జగన్ ఆరోపించారు.

ఇదే అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు, ఇటీవల జగన్ దేశరాజధాని న్యూఢిల్లీలో నిరసన కూడా చేపట్టారు.

జగన్ ఆందోళనకు ఇండియా కూటమి పార్టీలు కొన్ని మద్దతు పలికాయి.

అయితే, రాష్ట్రంలో జగన్ చెబుతున్న పరిస్థితులు లేవని, వ్యక్తిగతంగా జరుగుతున్న దాడులను సైతం ప్రభుత్వానికి అంటగడుతున్నారంటూ కూటమి నేతలు ఖండిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే కార్యకర్తల బాధలు వినేందుకు తాడేపల్లి కార్యాలయంలో జగన్ అందుబాటులోకి వచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular