fbpx
Wednesday, April 2, 2025
HomeAndhra Pradeshజగన్ నిర్ణయాలు.. వైసీపీ నేతలు వినట్లేదా?

జగన్ నిర్ణయాలు.. వైసీపీ నేతలు వినట్లేదా?

ఏపీ: రాజకీయాల్లో వైసీపీ నేతల వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పార్టీ అధినేత జగన్ తీసుకునే నిర్ణయాలను నేతలు పూర్తిగా పాటించడంలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ హాజరు నుంచి ప్రభుత్వంపై పోరాటం వరకు జగన్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని పార్టీలో అసంతృప్తి ఉంది.

తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వైసీపీ పోటీ చేయలేదు. అయితే, పార్టీ గ్రాడ్యుయేట్ ఓటర్లు పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావును గెలిపించాలని జగన్ సూచించినా, నేతలెవరూ స్పందించలేదు. చాలా మంది కీలక నేతలు ఓటింగ్ బూతుల వద్ద కనపడకపోవడమే కాకుండా, తమ ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్ చేయడం గమనార్హం.

ఎన్నికల పోలింగ్ రోజు, మధ్యాహ్నానికి టీడీపీ, కూటమి మద్దతుదారులే ఎక్కువగా ఉండటాన్ని మీడియా హైలైట్ చేసింది. వైసీపీ నేతలు ఆదేశాలు పాటించకపోవడం, నేతలలో నిస్పృహ పెరగడం పార్టీ భవిష్యత్తుపై అనేక అనుమానాలు కలిగిస్తోంది.

కూటమి గెలుపు అవకాశాలు మెరుగుపడుతున్న వేళ, వైసీపీ నేతలు లోపాయికారీగా వ్యవహరిస్తున్నారా? లేక పార్టీ నిర్ణయాలు వారికి ఆమోదయోగ్యంగా లేవా? అన్నది కీలకంగా మారింది. ఈ పరిస్థితులు వైసీపీకి సంకేతంగా మారుతాయా? అనేది వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular