fbpx
Saturday, September 7, 2024
HomeInternationalటేకాఫ్ అయిన కాసేపటికే ఇండోనేషియా విమానం గల్లంతు

టేకాఫ్ అయిన కాసేపటికే ఇండోనేషియా విమానం గల్లంతు

JAKARTA-PONTIANAK-FLIGHT-DISAPPEARED-AFTER-TAKEOFF

జకార్తా: ఇండోనేషియాకు చెందిన ఒక విమానం ప్రయాణికులను తీసుకుని టేకాఫ్ అయిన నాలుగు నిమిషాలకే అది అదృశ్యమైంది. జకార్తా నుంచి పాంటియానక్‌ కు బయలిదేరి వెళ్తున్న ఎస్‌జే 182 శ్రీవిజయ ఎయిర్‌ బోయింగ్‌ విమానం టేకాఫ్‌ తీసుకున్న కొన్ని నిమిషాలకే రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి.

గల్లంతైన ఆ విమానంలో ప్రయాణికులతో పాటు సిబ్బంది కలిపి మొత్తం 59 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఇండోనేషియా రాజధాని జకార్తాలోని సోకర్నో హట్టా విమానాశ్రయం నుంచి బయల్దేరిన కొన్ని నిమిషాలకే అదృశ్యమవడం కలకలం రేపుతోంది. అయితే ఆ విమానం ఓ ద్వీపంలో కూలిపోయి ఉంటుందని ఆ దేశానికి చెందిన మీడియా అంటోందని సమాచారం.

ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇండోనేషియా దేశంలో విమానయాలకు చాలా ఘటనలతో విషాద చరిత్ర ఉంది. 2018 అక్టోబర్‌ 29న ఇండోనేషియాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుని 189 మంది మృతి చెందిన విషయం అప్పట్లో సంచలనం అయ్యింది. గతంలో కూడా చాలా ప్రమాదాలు సంభవించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular