హైదరాబాద్: రాష్ట్రాల నుండి ధాన్యం సేకరణపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం ఒక లేఖ రాశారు. జాతీయస్థాయిలో అన్ని రాష్ట్రాల్లో ధాన్యం సేకరణలో ఒకటే విధానాన్ని రూపొందించాలని లేఖలో ప్రధానిని విజ్ఞప్తి చేశారు.
ఈ విషయంపై వ్యవసాయరంగ నిపుణులు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆయన తన లేఖలో కోరారు. తెలంగాణ రాష్ట్రంలో పండించిన పంటని కొనుగోలు చేయాలి. రబీ సీజన్లో 52 లక్షల ఎకరాల్లో వరి సాగు పెట్టించాం. ఎలాంటి ఆంక్షలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు.
దేశంలో ఇప్పటివరకు పంటల సేకరణపై ఎటువంటి పాలసీ లేదు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో వంద శాతం ధాన్యాన్ని సేకరిస్తున్నారు. పంజాబ్, హర్యానా తరహాలో తెలంగాణలో ధాన్యం సేకరించడం లేదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా పాలసీలు అమలవుతున్నాయని, అలా కాకుండా ధాన్యం సేకరణపై జాతీయ స్థాయిలో ఒకటే విధానాన్ని రూపొందించాలి. వ్యవసాయ రంగ నిపుణులు, సీఎంలతో సమావేశం నిర్వహించాలి’ అని సీఎం కేసీఆర్ ప్రధానికి రాసిన లేఖలో కోరారు.