fbpx
Thursday, September 19, 2024
HomeNationalలెఫ్టినెంట్ గవర్నర్‌ అపాయింట్మెంట్ కోరిన కేజ్రీవాల్

లెఫ్టినెంట్ గవర్నర్‌ అపాయింట్మెంట్ కోరిన కేజ్రీవాల్

Kejriwal -will-meet-Governor

న్యూఢిల్లీ: దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా‌ను కలవనున్నారు. ఆప్ (ఆమ్ ఆద్మీ పార్టీ) ప్రకటన ప్రకారం, ఈ సమయంలో కేజ్రీవాల్ తన రాజీనామా సమర్పించే అవకాశముంది.

సీఎం పదవికి రేసులో ఎవరు?
కేజ్రీవాల్ రాజీనామా చేసిన తర్వాత, సీఎం పదవికి ఎవరు వచ్చేవారన్న చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి అభ్యర్థులుగా అతీషీ, గోపాల్ రాయ్, సునీత కేజ్రీవాల్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, దళిత లేదా మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తిని సీఎం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.

కేజ్రీవాల్ తాజా నిర్ణయం:
మధ్యంతర ఎన్నికల ద్వారా తన విశ్వసనీయతను మరింత బలపడించుకోవాలని కేజ్రీవాల్ భావిస్తున్నారు. గత ఆదివారం కేజ్రీవాల్, తనతో పాటు మనీష్ సిసోడియా కూడా ప్రజల విశ్వాసాన్ని పొందారని, ఎన్నికల వరకు పార్టీ నేతల్లో ఒకరిని సీఎం గా నియమిస్తామని వెల్లడించారు.

పార్టీ సీనియర్ నేతల సమావేశం:
రాజీనామా ప్రకటన తర్వాత, ఆప్ సీనియర్ నేతలు మనీష్ సిసోడియా, రాఘవ్ చడ్డా కేజ్రీవాల్‌ను కలసి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. కేజ్రీవాల్ జైలులో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వహించిన అతీషీ ప్రస్తుతం ముఖ్యమంత్రి రేసులో ముందున్నారని ప్రచారం ఉంది.

కేజ్రీవాల్ వ్యాఖ్యలు:
కేజ్రీవాల్ 48 గంటల్లో రాజీనామా చేస్తానని ప్రకటించి, సుప్రీంకోర్టు తనకు న్యాయం చేసిందని, ప్రజల్లో కూడా న్యాయం జరిగాకే తిరిగి సీఎం సీట్లో కూర్చుంటానని చెప్పారు. 2024 అసెంబ్లీ ఎన్నికల ముందు మధ్యంతర ఎన్నికలతో తన విశ్వాసాన్ని పునరుద్ధరించుకోవాలని కేజ్రీవాల్ నిర్ణయించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular