fbpx
Sunday, March 23, 2025
HomeBig Storyఐపీఎల్ 2025: కోహ్లీ ఆటతో RCB మొదటివిజయగర్జన

ఐపీఎల్ 2025: కోహ్లీ ఆటతో RCB మొదటివిజయగర్జన

kkr-vs-rcb-virat-kohli-fifty-opening-match-win

ఐపీఎల్ 2025 సీజన్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు శుభారంభం చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆర్‌సీబీ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంలో బ్యాటింగ్‌ స్టార్ విరాట్ కోహ్లీ (59 నాటౌట్), ఓపెనర్ ఫిల్ సాల్ట్ (56) అద్భుత ప్రదర్శన చేశారు.

ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 174 పరుగులు చేసింది. కెప్టెన్ రహానే 56, నరైన్ 44, రఘువంశీ 30 పరుగులతో రాణించారు. ఆర్‌సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా 3, హజెల్‌వుడ్ 2 వికెట్లు తీశారు. ఒక దశలో భారీ స్కోర్ దిశగా సాగిన కేకేఆర్‌ను కృనాల్ చక్కగా కట్టడి చేశాడు.

లక్ష్య ఛేదనలో ఆర్‌సీబీకి శుభారంభం దక్కింది. ఫిల్ సాల్ట్, కోహ్లీ జోడీ పవర్‌ప్లేలోనే 80 పరుగులు చేసి కేకేఆర్‌పై ఒత్తిడి పెంచింది. ఫిల్ ఔటైన తర్వాత రజత్ పటీదార్ 34 పరుగులతో మెరుపులు మెరిపించాడు. చివర్లో లివింగ్‌స్టోన్ 15 నాటౌట్ పరుగులతో విజయం ముద్రించాడు.

ఆర్‌సీబీ 16.2 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 177 పరుగులు చేసి టోర్నీకి విజయవంతమైన ఆరంభాన్ని ఇచ్చింది. కోహ్లీ హాఫ్ సెంచరీతో మళ్లీ తన ఫామ్‌ను ఋజువు చేశాడు. ఇక తొలి మ్యాచ్‌లోనే ఆర్‌సీబీ అంచనాలకు మించి ఆడడం ఫ్యాన్స్‌కి ఫుల్ ఖుషీ ఇచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular