fbpx
Saturday, February 22, 2025
HomeTelanganaసంధ్య థియేటర్ ఘటన: రేవతి కుటుంబానికి కోమటిరెడ్డి సాయం

సంధ్య థియేటర్ ఘటన: రేవతి కుటుంబానికి కోమటిరెడ్డి సాయం

komatireddy-financial-help-for-sandhya-theater-victim

హైదరాబాద్: పుష్ప-2 ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన రేవతి కుటుంబానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భారీ ఆర్థిక సహాయం అందించారు.

అసెంబ్లీ వేదికగా ఆయన స్పందిస్తూ, రేవతి కుటుంబానికి తన ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా రూ.25 లక్షలు సహాయం అందిస్తున్నట్లు ప్రకటించారు.

అల్లు అర్జున్ మాట నిలబెట్టుకోలేకపోవడంపై విమర్శలు చేసిన మంత్రి, బాధిత కుటుంబాన్ని ఆదుకోవడంలో మనసు చీకట్లుగా మారకూడదని అన్నారు.

తొక్కిసలాటలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ చికిత్స పూర్తయ్యేంత వరకు వైద్య ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని వెల్లడించారు. ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి స్వయంగా ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తారని చెప్పారు.

ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి తెలిపారు.

థియేటర్ల వద్ద భద్రతా చర్యలు మరింత పటిష్ఠంగా ఉండాలని, ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగే పరిస్థితులు ఎదురుకాకుండా కట్టుదిట్టమైన నిబంధనలు అమలు చేస్తామని స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular