fbpx
Saturday, February 22, 2025
HomeInternationalఆరు గంటల్లోపు భారత్‌ విడిచి వెళ్లిపోండి!" - కెనడా దౌత్యవేత్తలపై భారత్‌ బహిష్కరణ వేటు

ఆరు గంటల్లోపు భారత్‌ విడిచి వెళ్లిపోండి!” – కెనడా దౌత్యవేత్తలపై భారత్‌ బహిష్కరణ వేటు

Leave India within 12 hours of that night!’- Expulsion of Canadian diplomats

అంతర్జాతీయం: ఆరు గంటల్లోపు భారత్‌ విడిచి వెళ్లిపోండి!” – కెనడా దౌత్యవేత్తలపై భారత్‌ బహిష్కరణ వేటు

భారత్‌, కెనడా మధ్య దౌత్య సంబంధాలు మరింత దిగజారాయి. ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసులో కెనడా భారత్‌పై వేస్తున్న ఆరోపణలపై తీవ్ర ఆగ్రహంతో, భారత ప్రభుత్వం కెనడా దౌత్యవేత్తలపై బహిష్కరణ చర్యలకు దిగింది. అక్టోబర్‌ 19 అర్ధరాత్రి 12 గంటలలోపు భారత్‌లో ఉన్న ఆరుగురు కెనడా దౌత్యవేత్తలు దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది.

ఇంతకు ముందు కెనడా ప్రభుత్వం, నిజ్జర్‌ హత్యకేసులో భారత హైకమిషనర్‌ సంజయ్‌ కుమార్‌ వర్మ సహా ఇతర దౌత్యవేత్తలను అనుమానితులుగా పేర్కొనడాన్ని తీవ్రంగా ఖండించిన భారత్‌.. తమ దేశంలో ఉన్న కెనడా దౌత్యవేత్తలను వెంటనే వెనక్కి రప్పించాలని నిర్ణయించింది. ఈ చర్యలను కెనడా తీసుకున్న చర్యలకు సమానంగా తీర్చిదిద్దినట్లుగా పేర్కొంది.

భారత విదేశాంగ శాఖ వెల్లడించిన ప్రకారం, ట్రూడో సర్కారు భారత రాయబారులకు భద్రత కల్పించడంలో విఫలమవుతుందని తమకు నమ్మకం లేదని స్పష్టంచేసింది. దౌత్యవేత్తలపై చేసిన ఆరోపణలు ఎటువంటి ఆధారాలు లేకుండా చేయడం ఆమోదయోగ్యం కాదని భారత అధికారులు పేర్కొన్నారు.

2023లో ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ హత్య జరిగాక, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో భారత్‌పై ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను భారత్‌ ఖండిస్తూ, కెనడా తీసుకుంటున్న చర్యలు దౌత్య సంబంధాలను మరింత దిగజారేలా చేస్తున్నాయని అభిప్రాయపడింది. నిజ్జర్‌ హత్యకు సంబంధించి ముగ్గురు నిందితులను కెనడా పోలీసులు అరెస్టు చేశారు, వీరికి పాక్‌ ఐఎస్‌ఐతో సంబంధాలు ఉన్నాయని భారత వర్గాలు అనుమానిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular