జాతీయం: అరేబియా సముద్రంలో రూ.1800 కోట్లు విలువైన మెథాంఫేటమిన్ స్వాధీనం
స్మగ్లర్ల మాయా బోటును గుర్తించిన కోస్ట్ గార్డ్
అక్రమ మాదకద్రవ్య రవాణాను అరికట్టేందుకు భారత తీర గస్తీదళం (Indian Coast Guard) మరొక కీలక విజయాన్ని నమోదు చేసింది. ఏప్రిల్ 12-13 అర్ధరాత్రి అరేబియా సముద్రం (Arabian Sea) లో జరిగిన సంయుక్త ఆపరేషన్లో కోస్ట్ గార్డ్, గుజరాత్ యాంటీ-టెర్రరిస్ట్ స్క్వాడ్ పాల్గొన్నారు.
అనుమానాస్పద బోటు..
భారత జలాల సరిహద్దుల్లో ఓ బోటు కదలికలు అనుమానాస్పదంగా కనిపించడంతో దాని వైపు కోస్ట్ గార్డ్ నౌకలు చేరుకున్నాయి. తమ ఉనికిని గుర్తించిన స్మగ్లర్లు వెంటనే బోటులో ఉన్న భారీ మొత్తంలో డ్రగ్స్ను సముద్రంలోకి విసిరేసి పారిపోయారు.
300 కిలోల మెథాంఫేటమిన్ – రూ.1800 కోట్ల విలువ
ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టిన తీర గస్తీదళం, ఏటీఎస్ సిబ్బంది సముద్రంలోకి దిగి డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఆ పరిమితిలో 300 కిలోలకుపైగా నిషేధిత మాదకద్రవ్యమైన మెథాంఫేటమిన్ (Methamphetamine) ఉన్నట్లు గుర్తించారు. దీని అంతర్జాతీయ మార్కెట్ విలువ రూ.1800 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు.
ఆపరేషన్ విజయవంతం – డ్రగ్స్ను ఏటీఎస్కు అప్పగింపు
స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలను తదుపరి దర్యాప్తు నిమిత్తం గుజరాత్ ఏటీఎస్కు అధికారికంగా అప్పగించినట్లు తీర గస్తీదళం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ కేసుకు సంబంధించిన మిగిలిన ముఠా సభ్యుల కోసం గాలింపు కొనసాగుతోందని సమాచారం.