fbpx
Saturday, October 19, 2024
HomeTelanganaగల్ఫ్ బాధితుల కోసం ‘ప్రవాసి ప్రజావాణి’ ప్రారంభించిన మంత్రి పొన్నం

గల్ఫ్ బాధితుల కోసం ‘ప్రవాసి ప్రజావాణి’ ప్రారంభించిన మంత్రి పొన్నం

Minister-Ponnam-launched-‘Pravasi-Prajavani’-for-Gulf victims

హైదరాబాద్: గల్ఫ్ బాధితుల కోసం ‘ప్రవాసి ప్రజావాణి’ ప్రారంభించిన మంత్రి పొన్నం

తెలంగాణ సర్కార్ గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి మరో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘ప్రవాసి ప్రజావాణి’ పేరుతో ఈ ప్రోగ్రామ్‌ను బుధ, శుక్రవారాల్లో నిర్వహించనుంది. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా భవన్ వేదికగా వారానికి రెండు రోజుల పాటు నిర్వహించనున్నారు.

గురువారం ప్రారంభమైన ప్రజావాణి కార్యక్రమానికి విపరీతమైన స్పందన లభించడంతో, గల్ఫ్ బాధితులకు మద్దతుగా ప్రత్యేకంగా ‘ప్రవాసి ప్రజావాణి’ని తీసుకొచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రధానంగా గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించనున్నారు.

ఈ రోజు ఉదయం 10.00 గంటలకు మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో పీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ వినోద్ కుమార్ కూడా పాల్గొన్నారు.

ప్రతి బుధ, శుక్రవారాల్లో గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేకంగా ప్రజావాణి కౌంటర్ తెరిచి ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ కౌంటర్ ద్వారా గల్ఫ్ కార్మికులు తమ సమస్యలను తెలియజేయవచ్చు, అలాగే వాటికి తగిన పరిష్కారాలు పొందవచ్చు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఈ కార్యక్రమంలో ముఖ్యమైన పాత్ర పోషించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular