fbpx
Sunday, February 23, 2025
HomeTelanganaతెలంగాణ మున్సిపల్‌ ఎన్నికలు జరుగుతాయి: ఎస్‌ఈసీ

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికలు జరుగుతాయి: ఎస్‌ఈసీ

MUNICIPAL-ELECTIONS-SCHEDULE-UNCHANGED

హైదరాబాద్‌: తెలంగాణలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలపై వివాదం కొద్ది రోజులుగా కొనసాగుతోంది. కాగా కోవిడ్‌ విజృంభిస్తోన్న వేళ ఈ ఎన్నికలు జరగడం ప్రమాదం, వాటిని తక్షణం నిలిపివేయాలని కోరుతూ కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ ఇటీవల కోర్టును ఆశ్రయించారు.

కాగా కోర్టు ఈ విషయాన్ని తోసిపుచ్చడమే కాక రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు విన్నవించాలని తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణపై స్పష్టతనిచ్చారు. మున్సిపల్ ఎన్నికలు యథాతధంగా నిర్వహించడం జరుగుతుంది అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి తెలిపారు.

ఏప్రిల్ 30వ తేదీన 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ విపత్కర కోవిడ్ సమయంలో నిబంధనలు పాటిస్తూ మున్సిపల్ ఎన్నికల నిర్వహిస్తాం. ప్రభుత్వ సూచన మేరకు యథావిధిగా ఎన్నికలు నిర్వహిస్తాం’’ అని పార్థసారధి తెలిపారు.

షబ్బీర్అలీ ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలని కోర్టును కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నైట్ కర్ఫ్యూను అమలు చేసిందని, ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటీషనర్ కోరారు. కాగా లంచ్ మోషన్ పిటిషన్‌ను విచారించేందుకు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ నిరాకరించారు.

ఎన్నికల కమిషన్‌కు మరోసారి విన్నవించాలని పిటీషనర్‌కు చీఫ్ జస్టిస్ సూచించారు. ఇప్పటికే హైకోర్టు సింగిల్ బెంచ్ ఎన్నికలను ఆపలేమని చెప్పడంతో డివిజన్ బెంచ్‌లో పిటీషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ఎస్‌ఈసీ ఎన్నికల నిర్వహణకే మొగ్గు చూపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular