fbpx
Wednesday, March 26, 2025
HomeAndhra Pradeshఏపీలో కొత్తగా పింఛన్లు

ఏపీలో కొత్తగా పింఛన్లు

New pensions in AP

ఆంధ్రప్రదేశ్: ఏపీలో కొత్తగా పింఛన్లు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మే నెల నుంచి 93,000 మంది కొత్త లబ్ధిదారులకు, ముఖ్యంగా వితంతువులకు, పింఛన్లు అందజేయనున్నట్లు సెర్ప్‌ (SERP) శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ప్రకటించారు.

మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది పింఛన్‌కు అర్హులుగా ఉన్నారని, త్వరలోనే అందరికీ మంజూరు చేయనున్నట్లు తెలిపారు.

మండల స్థాయిలో వికాసం – ప్రత్యేక దృష్టి
ఉపాధి కల్పన, మహిళల స్వయం సాధికారత, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని విజన్ డాక్యుమెంట్ రూపొందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక బలోపేతం
స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు మండలాల్లో ప్రత్యేకంగా మహిళా భవనాలను నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ భవనాలను శిక్షణ కేంద్రాలుగా అభివృద్ధి చేసి మహిళలకు ఆర్థిక, సామాజిక పరంగా బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

పేదరిక నిర్మూలనకు నూతన చర్యలు
పేదరిక నిర్మూలన కోసం నిరుపేద కుటుంబాలను దాతలకు అనుసంధానం చేసి, వారి ద్వారా మెరుగైన జీవన విధానం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular