జాతీయం: ఇక One Nation One Election -కేంద్రం గ్రీన్ సిగ్నల్
కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్ (జమిలి ఎన్నికలు) కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బుధవారం మధ్యాహ్నం కేబినెట్ సమావేశంలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ నివేదికను ఆమోదించింది. ఈ ప్రతిపాదనకు సంబంధించిన బిల్లు రానున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు.
కమిటీ అధ్యయనం:
వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనపై కేంద్రం 8 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది, ఇందులో రామ్నాథ్ కోవింద్ ప్రధానంగా చర్చించగా, కమిటీ అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్రాల అభిప్రాయాలను పరిశీలించింది. సుదీర్ఘ చర్చల అనంతరం, జమిలి ఎన్నికలు సాధ్యమని నివేదిక ఇచ్చింది.
ఇతర రాజకీయ పార్టీల స్పందన:
కాంగ్రెస్, ఇతర 15 రాజకీయ పార్టీలు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ ప్రతిపాదనను ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని విమర్శించారు.