అమెరికా అధికారులు తుర్క్మెనిస్థాన్లోని పాకిస్థాన్ రాయబారి కె.కె. ఎహ్సాన్ వాగన్ను లాస్ ఏంజెలెస్లో ప్రవేశించకుండా అడ్డుకున్నారు. సరైన వీసా, ప్రయాణ పత్రాలు ఉన్నప్పటికీ, ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయనను తిరిగి పంపించారు. ఈ ఘటన దౌత్య రంగంలో చర్చనీయాంశంగా మారింది.
వాగన్ సెలవుల నిమిత్తం అమెరికా వెళుతుండగా, విమానాశ్రయంలో అధికారులు తనిఖీ చేసి ప్రవేశాన్ని నిరాకరించినట్లు సమాచారం. వీసాలో కొన్ని వివాదాస్పద అంశాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, అమెరికా ప్రభుత్వం ఇప్పటివరకు దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు.
ఈ విషయంపై పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ స్పందిస్తూ, లాస్ ఏంజెలెస్ కాన్సులేట్ను విచారణకు ఆదేశించారు. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి వాగన్ను ఇస్లామాబాద్కు పిలిపించే అవకాశం ఉంది. గతంలో ఆయన పాకిస్థాన్ ఖాట్మండూ రాయబార కార్యాలయంలో, లాస్ ఏంజెలెస్ కాన్సులేట్లో కీలక పదవుల్లో పనిచేశారు.
ఈ చర్య వెనుక ప్రత్యేక కారణాలు లేవని, గతంలో వచ్చిన ఫిర్యాదుల వల్ల అమెరికా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని పాకిస్థాన్ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.
అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకారం, త్వరలోనే అమెరికా పాకిస్థాన్పై కొత్త ప్రయాణ నిషేధం విధించే అవకాశం ఉంది. దీనిపై పాకిస్థాన్ ప్రభుత్వం మరింత స్పష్టత కోరుతోంది.