దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఇవాళ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్లో రిషబ్ పంత్ తన సత్తా చాటాడు. ఇటీవల జరిగిన ఆసీస్తో టెస్టు సిరీస్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని మొదటి సారిగా టెస్టు ర్యాంకింగ్స్ టాప్ టెన్లోకి ప్రవేశించిన పంత్ తదుపరి జరిగిన ఇంగ్లండ్తో సిరీస్లోనూ బాగా మెరిసాడు.
కొత్తగా రిషబ్ పంత్(747 పాయింట్లు, ఆరో స్థానం) ఒక స్థానం ఎగబాకి తన కెరీర్ బెస్ట్ ర్యాంక్ ను సాధించాడు. ఇక విరాట్ కోహ్లి(814 పాయింట్లు) ఐదో స్థానాన్ని అలానే నిలబెట్టుకున్నాడు. కాగా రిషబ్ పంత్ హెన్రీ నికోలస్, రోహిత్ శర్మతో కలిసి సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచాడు.
మరో వైపు న్యూజిలాండ్ బ్యాట్స్మన్ కేన్ విలియమ్సన్ 919 పాయింట్లతో ర్యాంకింగ్ లో అగ్రస్థానంలో నిలిచాడు. ఇక ఆసీస్ స్టార్ బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్ 891 పాయింట్లతో రెండవ స్థానంలో, 878 పాయింట్లతో మార్నస్ లబుషేన్ మూడు, జో రూట్ 831 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు.
పాకిస్థాన్ బ్యాట్స్మన్ బాబర్ అజమ్ మూడు స్థానాలు దిగజారి 736 పాయింట్లతో 9వ స్థానంలో నిలిచాడు. జింబాబ్వేతో జరిగిన తొలి టెస్టులో బాబర్ గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. కాగా డేవిడ్ వార్నర్ 724 పాయింట్లతో 10వ స్థానంలో ఉన్నాడు.