fbpx
Sunday, April 6, 2025
HomeAndhra Pradeshఢిల్లీలో పవన్.. కేంద్ర మంత్రులతో కీలక చర్చలు

ఢిల్లీలో పవన్.. కేంద్ర మంత్రులతో కీలక చర్చలు

pawan-kalyan-delhi-tour-meetings

ఢిల్లీ: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో తన పర్యటనను కొనసాగిస్తూ కేంద్ర మంత్రులతో పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. 

భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ఆహ్వానంతో పవన్ ఆయన ఇచ్చిన విందుకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జనసేన ఎంపీలు బాలశౌరి, ఉదయ్ కుమార్ కూడా పాల్గొన్నారు.

పవన్ కళ్యాణ్ నిర్మాణాత్మక చర్చలతో తన పర్యటనను ముందుకు తీసుకెళ్లారు. కేంద్రమంత్రులు గజేంద్రసింగ్ షెకావత్, అశ్విని వైష్ణవ్, నిర్మలా సీతారామన్ లతో భేటీ అయ్యారు. 

ఏపీకి సంబంధించిన పలు అంశాలపై మంత్రులను చర్చించడంతో పాటు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కీలక అభ్యర్థనలు చేశారు. 

7,000 కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి నిధుల మంజూరు గురించి నిర్మలా సీతారామన్ తో చర్చించిన పవన్, కాలపరిమితి పొడిగింపుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.

రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో వైజాగ్ రైల్వే జోన్ పేరు మార్పు అంశంపై ధన్యవాదాలు చెప్పిన పవన్, రాష్ట్రంలో పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధి గురించి కూడా చర్చించారు. 

గ్రామీణ అభివృద్ధి మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తో ఉపాధి హామీ పథకం పరిధిలో కూలీల బడ్జెట్ పెంపు, గ్రామీణ రోడ్ల అనుసంధానం వంటి అంశాలపై చర్చించారు. 

పీఎం గ్రామీణ సడక్ యోజన కింద ఇంకా అనేక గ్రామాలకు రోడ్లు మంజూరు చేయాలని కోరారు. ఈ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఏపీ అభివృద్ధికి సంబంధించి ఈ చర్చలు కీలకంగా నిలుస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular