fbpx
Tuesday, April 22, 2025
HomeMovie Newsసంక్రాంతి కి రానున్న 'భీమ్లా నాయక్'

సంక్రాంతి కి రానున్న ‘భీమ్లా నాయక్’

PawanKalyan AKremake Update

టాలీవుడ్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు దగ్గుబాటి రానా కలిసి ఒక మల్టీ స్టారర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మలయాళం లో రూపొంది సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పణ్ణుమ్ కోశియుమ్’ అనే సినిమాని తెలుగు లో అధికారికంగా రీమేక్ చేస్తున్నారు. ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమా గురించి ఇవాళే ఒక అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. మొదట ఈ సినిమాని ఈ ఏడాది దసరా లేదా దీపావళి వరకు సిద్ధం చేసి పవన్ కళ్యాణ్ నటిస్తున్న మరో సినిమా ‘హరి హర వీర మల్లు’ సినిమాని సంక్రాంతి కి విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు కానీ కరోనా సెకండ్ వేవ్ వలన ప్లాన్స్ అన్నీ మారిపోయాయి. ఇలా అయినా కూడా వచ్చే సంక్రాంతి టాలీవుడ్ బిగ్గెస్ట్ హీరోస్ మహేష్, పవన్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేయనున్నాయి.

నిన్ననే ఈ సినిమాలో పవన్ లుక్ ఒకటి మరియు సినిమాలో పవన్ కారెక్టర్ పేరు రిలీజ్ చేసిన ఈ సినిమా టీం ఈ రోజు విడుదల తేదీ ని ప్రకటించింది. ‘అప్పట్లో ఒకడుండేవాడు‘ లాంటి కొత్త రకమైన సినిమాని రూపొందించిన సాగర్ చంద్ర ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకి రచనా సహకారం అందిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కళ్యాణ్, ఒక రిటైర్డ్ మిలట్రీ మెన్ పాత్రలో రానా ఈ సినిమాలో నటించనున్నారు. సినిమా మొత్తం వీళ్ళ ఈగో క్లాషెస్ పైన ఆధారపడి రన్ అవుతుంది. వకీల్ సాబ్ కి సూపర్ సంగీతం అందించిన థమన్ మరో సారి ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ కి పని చేయనున్నాడు.

Production No 12 - Making Glimpse | Pawan Kalyan | Rana Daggubati | Saagar K Chandra | Trivikram

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular