fbpx
Sunday, October 27, 2024
HomeNationalపొవార్‌ మరోసారి భారత మహిళల జట్టు ప్రధాన కోచ్

పొవార్‌ మరోసారి భారత మహిళల జట్టు ప్రధాన కోచ్

POWAR-INDIAN-WOMEN-COACH-AGAIN-APPOINTED-BY-BCCI

ముంబై: భారత మహిళల జట్టు ప్రధాన కోచ్‌గా మరోసారి టీమిండియా మాజీ క్రికెటర్‌ అయిన రమేశ్‌ పొవార్‌ను బీసీసీఐ నియమించింది. ఈ సమాచారాన్ని బీసీసీఐ ఈ రోజు తన ట్విటర్‌ అకౌంట్ లో షేర్‌ చేసింది. హెడ్‌కోచ్ పదవికి మొత్తం 35 అప్లికేషన్స్‌ వచ్చాయి, అందులో ఆర్పీ సింగ్‌, మదన్‌ లాల్‌, సులక్షణ నాయక్‌ కూడా ఉన్నారు.

వారందరినీ పరిశీలించిన క్రికెట్‌ అడ్వైజరీ కమిటీ హెడ్‌కోచ్‌గా పొవార్‌కే మరోసారి ఓటు వేసింది. కమిటీ​ సిఫార్సు మేరకు బీసీసీఐ కూడా పొవార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. కాగా ప్రస్తుతం టీమిండియా మహిళల కోచ్‌గా ఉన్న డబ్ల్యూవీ రామన్‌ నుంచి పొవార్‌ బాధ్యతలు తీసుకోబోతున్నారు.

కాగా 2018 డిసెంబర్‌లో పొవార్‌ నుంచే బాధ్యతలు తీసుకున్న రామన్‌ జట్టును ఇంతవరకు విజయవంతంగా నడిపాడు. 2020లో టీ20 ప్రపంచకప్‌లో హర్మన్‌ ప్రీత్‌ సేన ఫైనల్‌దాకా వెళ్లడంలో రామన్‌ ప్రముఖ పాత్ర పోషించాడు. అంతకముందు పొవార్‌ 2018లో టీమిండియా మహిళల జట్టుకు కొంతకాలం పాటు హెడ్‌ కోచ్‌గా సేవలందించాడు.

గతంలో సీనియర్‌ క్రికెటర్‌తో పొడచూపిన విబేధాల కారణం గా పొవార్‌ ఇంతకు ముందు కేవలం మూడు నెలల కాలనికి మాత్రమే కోచ్‌గా వ్యవహరించాడు. ఆ తర్వాత పొవార్‌ను కొనసాగించడానికి ఇష్టపడని బీసీసీఐ, డబ్యూవీ రామన్‌ను కోచ్‌గా నియమించింది. కాగా, మళ్లీ తాను కోచ్‌ పదవికి దరఖాస్తు చేసుకున్న పొవార్‌, అందరికంటే ఎక్కువ మార్కులు కొట్టేసి భారత మహిళా క్రికెట్‌ జట్టు కోచ్‌గా మరొకసారి ఎంపిక కావడం ఆశ్చర్యం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular