fbpx
Saturday, October 19, 2024
HomeMovie Newsరాజేంద్రప్రసాద్ కు తీరని లోటు.. ఆ పాట జ్ఞాపకం మర్చిపోలేనిది

రాజేంద్రప్రసాద్ కు తీరని లోటు.. ఆ పాట జ్ఞాపకం మర్చిపోలేనిది

RAJENDRA-PRASAD-DAUGHTER-EXPIRED-SPECIAL-SONG-FOREVER
RAJENDRA-PRASAD-DAUGHTER-EXPIRED-SPECIAL-SONG-FOREVER

మూవీడెస్క్: నటకిరీటి రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి అకాల మరణం తెలుగు చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

కేవలం 38 ఏళ్ల వయసులో ఈ లోకాన్ని విడిచిపోవడం ఆమె కుటుంబానికి, అభిమానులకు తీరని లోటు.

గాయత్రి ప్రేమ వివాహం చేసుకోవడం వల్ల తండ్రితో కొంతకాలం దూరంగా ఉన్నప్పటికీ, ఆ దూరం త్వరలోనే కరగిపోయింది.

2018లో వచ్చిన బేవార్స్ సినిమాలో రాజేంద్రప్రసాద్ నటించిన కూతురు మరణం సన్నివేశం నిజ జీవితంలో కూడా అతనికి బరువుగా మారింది.

ఈ సినిమాలో ఉన్న భావోద్వేగపూరిత పాటను వినిపిస్తూ గాయత్రితో జరిగిన సన్నిహిత సంబంధాన్ని ఒక ఈవెంట్ లో కూడా గుర్తుచేసుకున్నారు.

ఆ పాట ఇద్దరినీ ఎమోషనల్‌గా దగ్గర చేసిందని, ఆ రోజున నుంచి వారి మధ్య ఉన్న దూరం తగ్గిపోయిందని చెప్పుకొచ్చారు.

ఆ వీడియో ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే, ఇప్పుడు ఆ బంధం మరింత బలపడిన తరుణంలో గాయత్రి మరణం రాజేంద్రప్రసాద్ హృదయాన్ని చీల్చి వేసింది.

ఆ సినిమాలో కూతురు మరణం సన్నివేశంలో నటించడం చాలా కష్టం. అలాంటిది ఇప్పుడు నిజ జీవితంలో అది ఎదురవడం వేదనతో కూడుకున్న అనుభవంగా మారింది.

ఈ తీవ్ర వేదన నుండి రాజేంద్రప్రసాద్ త్వరగా కోలుకోవాలని, సినీ ప్రముఖులు అభిమానులు కోరుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular